News

మోదీ సర్కార్‌కు పదికి ఏడు మార్కులు


నరేంద్ర మోదీ నేతృత్వంలో తొలి ఏడాది ఏర్పాటైన ప్రభుత్వ పనితీరుపై పది మార్కులకు గాను ఏడు మార్కులు వేస్తున్నట్లు ఇండస్ట్రీ బాడీ అసోచామ్ వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంలో పన్నులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో విఫలంకావడంతో వ్యాపార సానుకూలత వాతావరణం నెలకొల్పలేక పోయిందని తెలిపింది. 


కానీ దేశ ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దడంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించిందని.. ముఖ్యంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, రూపాయి విలువ స్థిరత్వంలోకి రావడంతో ఆర్థిక మార్కెట్లు ఆకర్షణీయ స్థాయికి చేరుకున్నాయి.